
కూకట్పల్లి, వెలుగు: ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా బాలానగర్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వృద్ధులు, దివ్యాంగులు ఇచ్చిన ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ చేసి వారి ఇంటికే తీసుకువెళ్లి ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 65 ఏండ్ల వృద్ధురాలు సరికొండ భ్రమరాంబ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
సోమవారం బాలానగర్ ఇన్స్పెక్టర్ నరసింహారాజు స్వయంగా సిబ్బందితో ఆమె ఇంటికి వెళ్లి ఎఫ్ఐఆర్ కాపీని అందజేశారు. ఈ పరిణామంపై బాధితురాలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ నరసింహారాజు మాట్లాడుతూ సైబరాబాద్ సీపీ అవినాష్మహంతి సూచనలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. సున్నితమైన కేసుల్లో సివిల్ డ్రెస్సుల్లో వెళ్లి ఎఫ్ఐఆర్ కాపీలను అందించనున్నట్లు వివరించారు.