దేశంలో 90 వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో 90 వేలు దాటిన కరోనా కేసులు

ఒక్క రోజే 4,759 మందికి
ఒక్క మహారాష్ట్రలోనే 30 వేలకుపైగా నమోదు
గుజరాత్, తమిళనాడు, ఢిల్లీల్లోనూ దారుణంగా పరిస్థితి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే ఏకంగా 4,759 మందికి పాజిటివ్​ వచ్చింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీల్లో పరిస్థితి దారుణంగా ఉంది. శనివారం నాటి కేసుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి నమోదైనవే మూడున్నర వేలకుపైగా ఉన్నాయి. దేశ ఫైనాన్షియల్​ క్యాపిటల్​గా పేరున్న ముంబై సిటీలోనే కరోనా కేసులు 18 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,862 మంది చనిపోయారు. శనివారం మృతిచెందినవాళ్లు 109 మంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 47 లక్షలకు చేరాయి. మృతుల సంఖ్య 3 లక్షల 10 వేలు దాటింది. అమెరికాలో కేసులు 15 లక్షలకు, మృతుల సంఖ్య 89,129కి చేరింది.

మరిన్ని వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి