
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 5,916
ఒక్కరోజే 773 కొత్త కేసులు
ఇప్పటివరకు 149 మంది మృతి
179మంది కరోనాకుబలి
కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు 6 వేలకుదగ్గరయ్యాయి. బుధవారం నాటికి 5,916 మంది కరోనాకు బాధితులయ్యారు. చనిపోయిన వారి సంఖ్య 179కి పెరిగింది. ఇప్పటిదాకా మహమ్మారి బారి నుంచి 507
మంది కోలుకున్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు హోంశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. మహారాష్ట్రలో వైరస్ బాధితులను గుర్తించేందుకు పుణె, కోండ్ వా రీజియన్లో 35 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇంటింటి సర్వే చేపట్టనున్నట్లు వివరించారు.
ఈ సర్వేలో పాల్గొనే హెల్త్ వర్కర్లు అక్కడి ప్రజల ఆరోగ్య పరిస్థితి, షుగర్, హైబీపీ చెక్ చేయడంతో పాటు ట్రావెల్ హిస్టరీని తెలుసుకుంటారని తెలిపారు. కేరళలోని పథనంథిట్టలో కరోనా కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం సరవై్లెన్స్ చేస్తున్నట్లు వివరించారు. శరీరంలోకి చేరిన వైరస్ను ఎంత త్వరగా గుర్తిస్తే అంతమేలని అగర్వాల్ చెప్పారు. వైరస్ సోకినా కూడా కొంతమందిలో లక్షణాలు బయటపడకపోవడం సవాలుగా మారుతోందన్నారు. సోషల్ డిస్టెన్స్ వల్ల ఇలాంటి ప్రమాదాన్ని తప్పించుకోవచ్చని తెలిపారు.