
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. శనివారం తాజాగా 48 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు. మొత్తం 9628 మంది పరీక్షలు నిర్వహించగా, 48 మంది పాజిటివ్ వచ్చిందని.. కర్నూలుకు చెందిన కరోనా బాధితుడు ఈ రోజు మరణించాడని తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2205కి చేరగా..1353 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 803 యాక్టీవ్ కేసులు ఉండగా..49 మంది కరోనా మహమ్మారితో మరణించారని తెలిపారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.
కొత్తగా నమోదైన 48 కేసుల వివరాలు
గుంటూరు 09
కర్నూలు 09
నెల్లూరు 09
చిత్తూరు 08
కృష్ణా 07
వైజాగ్ 04
కడప 01
వెస్ట్ గోదావరి 01