దేశంలో లక్షా 40 వేలు దాటిన మృతులు

దేశంలో లక్షా 40 వేలు దాటిన మృతులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత వారం రోజులుగా 40 వేలకు దిగువ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో  కొత్తగా 36 వేల 11 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 96 లక్షల 44 వేల 222 కి చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 428 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య లక్షా40వేల 182కు చేరింది. నిన్న మరో 41 వేయి  970 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకూ 91 లక్ష792  మంది కరోనా నుంచి కోలుకున్నారు.  4 లక్షల 3 వేల 248యాక్టివ్ కేసులున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 11లక్షల ఒక వేయి 63  టెస్టులు చేశారు. దీంతో డిసెంబర్ 5 వరకు దేశంలో కరోనా టెస్టుల సంఖ్య  మొత్తం 14 కోట్ల 69 లక్షల 86 వేల 575 టెస్టులు చేశారు.

 

హైదరబాద్ లో అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం