
మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. గురువారం పొద్దున వరకు మహారాష్ట్రలో కరోనా కేసులు 1,297మంది వైరస్ బారిన పడగా, 72మంది చనిపోయారు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం పొద్దున వరకు కొత్తగా 162కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే ముంబైలోని ధారావిలో కరోనా కేసులు నమోదయ్యాయి. అక్కడ తక్కువ విస్తీర్ణంలో ఎక్కువమంది జనాలు నివాసముంటారు. ఇది ఆసీయాలో అతి పెద్ద మురికివాడలలో ఒకటి. ధారావిలో ఇప్పటివరకు 13 కరోనా పాజిటీవ్ కేసులు నమోదవగా బుధవారం రెండు మరణాలు సంభవించాయి. నెల రోజుల వ్వవధిలో మహారాష్ట్రలో వెయ్యి కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాలరేటులో మహారాష్ట్ర దేశంలో మొదటిస్థానంలో ఉంది.
ఇంటింటికి తిరిగి సర్వే చేయడంతో కరోనా కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయన్నారు ఆరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే. ముంబై, పూణెలలో ఇంటింటికి వెళ్తూ సర్వే చేస్తున్న టీంలను పెంచినట్లు చెప్పారు. మహారాష్ట్రలో మొదటి కరోనా పాజిటటీవ్ కేసు పూణెలో దుబాయ్నుంచి వచ్చిన దంపతులకు వచ్చిందని అన్నారు. వారితో సంబంధాలున్న మరో ముగ్గురికి కూడా కరోనా ఎఫెక్ట్ అయిందని తెలిపారు.
మహారాష్ట్రలో కరోనా స్టేజ్ -2 లో ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే అన్నారు. బయటనుంచి వచ్చిన వారితోనే కరోనా వ్యాపిస్తుందని అన్నారు. అయితే పౌరులు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని తెలిపారు. ఒకవేల మాస్క్లు ధరించకుండా బయటకు వస్తే IPC 188 ప్రకారం అరెస్ట్ చేస్తామని చెప్పారు.