రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో  16 మందికి కరోనా 

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో  16 మందికి కరోనా 

రంగారెడ్డి: కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఆదివారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం రేగింది. విధులు నిర్వహిస్తున్న 16 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎస్ఐ, ఎఎస్ఐ‌తో పాటు 14 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు..  మాస్క్ లేకుండా పోలీస్ స్టేషన్‌లోకి ఎవరనీ రానివ్వడంలేదు. ఫిర్యాదు దారుడు ఒక్కరే పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆంక్షలు విధించారు.