మళ్లీ విస్తరిస్తున్న కరోనా.. ఒక్క రోజే వందల కేసులు నమోదు..

మళ్లీ విస్తరిస్తున్న కరోనా.. ఒక్క రోజే వందల కేసులు నమోదు..

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తుంది. రోజు రోజుకు ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య పెరుగుతుతోంది. తాజాగా, నిన్న(మంగళవారం)  ఒక్క రోజే 600 పైగా కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 602 కేసులు నమోదయ్యాయి.  5 మంది ఈ వ్యాది బారిన పడి మృతి  చెందారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4 వేల 440 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.

 దీంతో పాటు కరోనా సబ్ వేరియంట్ జేఎన్ వన్ కూడా దేశ వ్యాప్తంగా విస్తరిస్తుంది. తాజాగా జేఎన్ వన్ కేసులు 263కి చేరాయి. పది రాష్ట్రాల్లో జేఎన్ వన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యఆరోగ్య సంస్థ ప్రకటించింది. అత్యధికంగా కేరళలో 133 మంది ఈ వ్యాది బారిన పడ్డారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే తగు చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.