పద్మారావునగర్, వెలుగు: తమను విధుల్లోకి తీసుకోకపోతే చావే గతి అని గాంధీ హాస్పిటల్ లోని కొవిడ్-–19 పేషెంట్ కేర్ మాజీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హాస్పిటల్ మెయిన్ గేట్ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద వారు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇప్పటికే తాము మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావుతోపాటు డీఎంఈ రమేశ్రెడ్డిని కలిశామని, అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకునేంతవరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ ధర్నాలో మాజీ సిబ్బంది నందిని, దివ్య, సరిత, సంధ్య, తేజ, విజయ్, కరుణాకర్ పాల్గొన్నారు.-