
శ్రీకాళహస్తి: ఏపీలో కరోనా విజృంభిస్తుంది. రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. కరోనా కాటుకి ఎంతో మంది బలైపోతున్నారు. ఇప్పటికే పలువురి ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడగా..శనివారం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన భార్యకు కూడా మహమ్మారి సోకింది. ఈ క్రమంలో వారిద్దరూ క్వారంటైన్ కు వెళ్లారు. మరోవైపు, వారితో కాంటాక్ట్ లోకి వచ్చిన వారందరికీ అధికారులు కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు. కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు వైద్యశాఖ అధికారులు. ఏపీలో ఇప్పటికే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40వేలను దాటగా.. 534 మంది కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయిన విషయం తెలిసిందే.