కరోనా అనుమానంతో బాలింతను ఊరిలోకి రానివ్వలేదు

కరోనా అనుమానంతో బాలింతను ఊరిలోకి రానివ్వలేదు

ఆదిలాబాద్ జిల్లా: ఉట్నూర్ మండలం, రాజుగూడ గ్రామంలో దారుణం జరిగింది. కరీంనగర్ నుండి వచ్చిన వలస కూలీ బాలింతను కరోనా అనుమానంతో ఊరిలోకి రానివ్వలేదు గ్రామస్థులు. దీంతో 3 రోజులుగా బాలింత కుటుంబం గ్రామ శివారులోనే ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూర్ మండలం, రాజుగూడ గ్రామానికి చెందిన ఓ ఫ్యామిలీ.. కొన్ని నెలల క్రితం కరీంనగర్ జిల్లాలోని ఓ పోల్ట్రీ పోమ్ లో పని చేయటానికి వెళ్లింది.

అయితే ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన మహిళ .. తన కుటుంబంతో తిరిగి సొంత గ్రామానికి 3 రోజుల క్రితం చేరుకుంది. అయితే కరోనా అనుమానంతో గ్రమస్థులు వారిని ఊరిలోకి రానివ్వక పోవడంతో మూడు రోజులుగా ఊరి బయటే ఉన్నారు. చివరకు వైద్య సిబ్బందికి ఈ విషయం తెలియడంతో.. బాలింత ఫ్యామిలీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత గ్రామస్థులకు కౌన్సిలింగ్ ఇచ్చిన అధికారులు, బాలింత కుటుంబాన్ని హోమ్ క్వరంటైన్ చేశారు.