అమీర్ పేట్ కార్పొరేటర్ కు కరోనా

అమీర్ పేట్ కార్పొరేటర్ కు కరోనా

హైదరాబాద్, వెలుగు: అమీర్ పేట్ కార్పొరేటర్ శేషు కుమారికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె
ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. శేషు కుమారితోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులకూ వైరస్ సోకింది. ఆ ఫ్యామిలీతో కాంటాక్ట్ అయిన మరికొందరి శాంపిల్స్ ను మెడికల్ స్టాఫ్ సేకరించినట్టు తెలుస్తోంది.
కాప్రా సర్కిల్ ఆఫీస్ లో 20 మందికి..
జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ ఆఫీసులో 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ కన్ఫర్మ్ అయింది. వారిలో శానిటేషన్, ఎంటమాలజీ విభాగాల వాళ్లు ఉన్నారు. మిగిలిన ఉద్యోగులను హోం క్వారంటెయిన్ లో ఉండాలని అధికారులు సూచించారు.
ఏఎస్సై మృతి
కాలాపత్తర్ ‌‌ఏఎస్సై యూసుఫ్‌‌(54) సోమవారం కరోనాతో మృతి చెందారు. ఇటీవలే ఆయన హెడ్ కానిస్టేబుల్ నుంచి ప్రమోషన్ పొందారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం