ఖర్చులన్నీ సర్కారువే: ప్రైవేట్ టీచింగ్ హాస్పిట‌ళ్ల‌లో కరోనా ట్రీట్ మెంట్

ఖర్చులన్నీ సర్కారువే: ప్రైవేట్ టీచింగ్ హాస్పిట‌ళ్ల‌లో కరోనా ట్రీట్ మెంట్

ఖర్చులన్నీ సర్కారువే..మందులు, పీపీఈ కిట్లూ ఉచితమే
ఒక్కో పేషెంట్ ట్రీట్ మెంట్ కు రూ.10 వేలు ఇచ్చే యోచనలో సర్కార్
ఆ చార్జ్ అయితే కష్టమేనంటున్న ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు
పలు ప్రైవేటు హాస్పిటల్స్ లో మంత్రి ఈటల పర్యటన

హైదరాబాద్ , వెలుగు: కరోనా పేషెంట్లకు ప్రైవేటు టీచింగ్ హాస్పిటళ్ల‌లో ట్రీట్ మెంట్ చేయించాలని సర్కార్ నిర్ణ‌యించింది. ట్రీట్ మెంట్ కు అవసరమైన మందులు, పీపీఈ కిట్లు, ఇతర అన్ని వస్తువులనూ సర్కారే ఆయా హాస్పిటల్స్ కు ఇవ్వనుంది. ట్రీట్ మెంట్ కు అయ్యే ఖర్చునూ ప్రభుత్వమే భరించనుంది. పేషెంట్ల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయొద్దని, వాళ్లకు పెట్టే ఆహారానికి కూడా సర్కారే డబ్బు చెల్లిస్తుందని హాస్పిటల్స్ కు ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఆరోగ్యశాఖ పేర్కొంది. అవసరమైన మందులు, ఇతర వస్తువుల కోసం ఇండెంట్ పెట్టాలని హాస్పిటళ్ల సూపరింటెండెంట్లకు సూచించింది. ప్రైవేటులో కరోనా ట్రీట్మెంట్ కు అవసరమైన ప్రొటోకాల్ ను ఫీవర్ హాస్పిటల్ డైరెక్ట‌ర్ ‌‌డాక్ట‌ర్ శంకర్ తయారు చేస్తున్నారు. అవసరమైన సలహాలు, సూచనల కోసంగాంధీ, నిమ్స్ డాక్ల‌ర్ల‌ను సంప్రదించాల్సిందిగా టీచింగ్ హాస్పి టళ్లకు సూచిస్తున్నారు. ఇక, కరోనా ట్రీట్ మెంట్ కు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేస్తున్న ఏర్పాట్లను ఆరోగ్య శాఖ మంత్రి ఈటల బుధవారం పరిశీలించారు. హైదరాబాద్ లోని కామినేని హాస్పిటల్, ఒవైసీ హాస్పిటల్ సహా పలు ప్రైవేటు టీచింగ్ హాస్పిటల్స్ ను ఆయన పరిశీలించారు.

సర్కార్ ఫిక్స్ చేసిన చార్జ్ తో కష్టమే!

గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న ప్రైవేటు టీచింగ్ హాస్పిటల్స్ లో తొలుత కరోనా ట్రీట్ మెంట్ ప్రారంభించాలని సర్కారు నిర్ణ‌యించింది. ఆ తర్వాత ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్ అందుబాటులో లేని దగ్గర, ప్రైవేటు హాస్పిటల్స్ ను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ప్రభుత్వ డాక్టర్లు రిఫర్ చేసిన పేషెంట్లకు మాత్రమే ప్రైవేటులో ట్రీట్ మెంట్ ను అందించనున్నారు. ఇందుకోసం ఒక్కో పేషెంట్ కు నామినల్ రూ.10 వేల వరకూ ఆయా హాస్పిటల్స్ కు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ‌‌భావిస్తోంది. అంత తక్కువ ఇస్తే ట్రీట్ మెంట్ చెయ్యడం కష్టమేనని ప్రైవేట్ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్టు పేషెంట్ కండిషన్ ను బట్టి రూ.16 వేల నుంచి రూ.2.20 లక్షల వరకూ ఇవ్వాలని కోరుతున్నాయి. కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు, నర్సులకు జీతాలు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుందని, అలాగే వార్డుల మెయింటెనెన్స్, శానిటైజేషన్ , సెక్యూరిటీ వంటివన్నీ ఖర్చులతో కూడుకుని ఉంటాయని ఓ ప్రైవేటు హాస్పిటల్ యజమాని వెలుగుకు వివరించారు. ఆ మేరకు సర్కార్ డబ్బులు ఇవ్వకుండా, అరకొరగా ఇచ్చి ట్రీట్ మెంట్ చేయాలంటే తమకు కష్టమవుతుందని చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం