ఇయ్యాల్టి నుంచి  పిల్లలకు వ్యాక్సిన్

ఇయ్యాల్టి నుంచి  పిల్లలకు వ్యాక్సిన్

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో బుధవారం నుంచి 12 నుంచి 14 ఏండ్ల వయసు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తున్నట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌(డీహెచ్), డాక్టర్  శ్రీనివాసరావు ప్రకటించారు. రాష్ట్రంలో ఈ వయసు గ్రూపులో 17.23 లక్షల మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో వీళ్లకు వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుందన్నారు. వ్యాక్సినేషన్‌ కోసం కొవిన్ పోర్టల్‌లో ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, లేదా నేరుగా సెంటర్​కు వచ్చినా వ్యాక్సిన్ వేస్తామన్నారు. హైదరాబాద్‌లోని బయోలాజికల్–ఈ సంస్థ రూపొందించిన కొర్బెవాక్స్‌ వ్యాక్సిన్‌ను వీరికి ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు తీసుకున్న 4 వారాల తర్వాత రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. ఖైరతాబాద్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌‌లో మంత్రి హరీశ్‌రావు బుధవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.