చెట్టును ఐసోలేషన్ కేంద్రంగా మార్చుకున్న కార్మికులు

చెట్టును ఐసోలేషన్ కేంద్రంగా మార్చుకున్న కార్మికులు

ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ తో అన్ని దేశాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో వైరస్ ను కట్టడి చేసేందుకు ఇతర దేశాలనుంచి  వచ్చిన వారిని తమ దేశాలకు రానీయకుండా చర్యలు చేపట్టారు. ఒక వేళ అదే దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కూడా నేరుగా హోం క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. ముఖ్యంగా భారత దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

కరోనాను కట్టడి చేసేందుకు పశ్చిమబెంగాల్  రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో హోం క్వారంటైన్ కొనసాగుతోంది. అయితే పేదలు తమ ఇంట్లో ఉండలేని పరిస్థితులతో   కొందరు చెట్లను ఆశ్రయంగా చేసుకుని 14 రోజులపాటు హోం క్వారంటైన్ గా ఉంటున్నారు. పురులియ జిల్లాలోని ఓ గ్రామానికి… తమిళనాడులోని చెన్నై నుంచి ఏడుగురు కార్మికులు వచ్చారు. అయితే లాక్ డౌన్ కొనసాగుతుండడంతోపాటు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో గ్రామంలోకి  వచ్చిన కార్మికులను అధికారులు గుర్తించారు. వారిని పరిశీలించిన తర్వాత 14 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. అక్కడ ఎలాంటి అసోలేషన్ గదుల సధుపాయం లేక పోవడంతో…వారు ఐసోలేషన్ కోసం  14 రోజుల పాటు చెట్టును నివాసంగా చేసుకున్నారు. గ్రామానికి సమీపంలోని చెట్టును ఐసోలేషన్ కేంద్రంగా మార్చుకుని కూర్చున్నారు. తమ ఇంట్లో హోం క్వారంటైన్ కు కావాల్సిన  ఏర్పాట్లు లేకపోవడంతో  గ్రామస్తుల సూచనతో ఆ ఏడుగురు కార్మికులు చెట్టు ఎక్కారు. చెట్టుపై  గుడారం ఏర్పాటు చేసుకున్నారు. చెట్టు కొమ్మలకు గుడ్డ కట్టి కూర్చోవడానికి ఏర్పాట్లు  చేసుకోగా.. వంట చేసుకోవాడానికి కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారట. క్వారంటైన్ కోసం ఏర్పాటు చేయకపోవడంపై  పలువురు  పశ్చిమబెంగాల్  ప్రభుత్వంపై మండిపడుతున్నారు. బాధితుల కోసం ఏర్పాట్లు  చేసే తీరిక లేదా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.