- వికారాబాద్ జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి
వికారాబాద్, వెలుగు : జిల్లాలో పండించిన పత్తిని సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు చేస్తుండగా.. స్థలం లేకపోగా 3 రోజులు విక్రయాలు నిలిపివేసినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. మిల్లుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని దిగుమతి చేసుకోవడానికి ఈనెల 4వ తేదీ నుంచి రైతుల వద్ద తిరిగి కొనుగోలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.