
- కారులో తీసుకువెళ్తానని నమ్మించిన బోధన్ ప్రజాప్రతినిధి
- చితకబాదిన స్థానికులు
- పోక్సో కేసు నమోదు చేసిన ఎడపల్లి పోలీసులు
నిజామాబాద్/ ఎడపల్లి/బోధన్, వెలుగు: బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధాకృష్ణ 17 ఏండ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో ఎడపల్లి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అనారోగ్యంతో ఉన్న తల్లికి మందులు కొనడానికి సోమవారం శక్కర్నగర్ చౌరస్తా నుంచి నిజామాబాద్కు ఆటో రిక్షాలో బయలుదేరిన బాలికను కారులో ఫాలో చేసిన రాధాకృష్ణ ఎడపల్లి బస్టాండ్ వద్ద దింపాడు.
తాను నిజామాబాద్ వెళ్తున్నానని నమ్మించి కారులో కూర్చోబెట్టుకున్నాడు. తను ఉండే వార్డు కౌన్సిలర్కావడంతో బాలిక ఈజీగా అతడిని విశ్వసించింది. అప్పటికే చీకటి పడుతుండగా మంగల్పాడ్ విలేజ్వెళ్లే దారిలో రోడ్ పక్కన కారును ఆపి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక ఏడ్వడంత రాత్రి 9 గంటల టైంలో దగ్గర్లోని వైన్స్కు కొద్ది దూరంలో కారు ఆపి బీర్ కొనుక్కోవడానికి వెళ్లాడు. అటు బైక్పై వెళ్తున్న ఇద్దరు కారులో ఏడుస్తున్న బాలికను చూసి ప్రశ్నించగా జరిగిన సంగతి చెప్పింది. వారు తెలిసిన మరికొందిరికి ఫోన్చేసి అక్కడికి పిలిపించారు.
బీరుతో తిరిగి వస్తున్న రాధాకృష్ణను అందరూ కలిసి చితకబాదారు. సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు రాధాకృష్ణను అదుపులోకి తీసుకొని బాలికను జీజీహెచ్ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే విషయం బోధన్వరకు చేరడంతో బాలిక సంబంధీకులు వందల సంఖ్యలో పీఎస్కు వచ్చారు. రాధాకృష్ణను తమకు అప్పగించాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులు ఆయనను స్టేషన్నుంచి వేరే చోటికి తీసుకువెళ్లారు.
నిందితుడిని బోధన్ కోర్టులో హాజరుపర్చడానికి తీసుకువెళ్తున్నారని తెలుసుకున్న బాలిక మద్దతుదారులు మంగళవారం రాత్రి అక్కడికి చేరుకున్నారు. దీంతో సీపీ కల్మేశ్వర్అదనపు ఫోర్స్ పంపారు. ఏడాదిలో రెండో కేసు కౌన్సిలర్ రాధాకృష్ణ తమ్ముడు రవీందర్ గత ఏడాది మార్చి 19న 13 ఏండ్ల బాలికపై అత్యాచారం చేయగా బోధన్లో కేసు నమోదైంది. తమ్ముడిని కాపాడడానికి బాధిత బాలిక తల్లిని బెదిరించడంతో రాధాకృష్ణపై కూడా కేసు ఫైలయ్యింది. తాజాగా ఇప్పుడు పోక్సో కేసు రిజిష్టరయ్యింది.