గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సిలింగ్ను బుధవారం ప్రారంభించారు.
ఈ నెల 15,16,18 తేదీల్లో కౌన్సిలింగ్ ఉంటుందని రిజిస్ట్రార్ ఎం. వెంకటరమణ తెలిపారు. కార్యక్రమంలో పీజీ స్టడీస్ డీన్ డాక్టర్ అనిత, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.