తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బాంబు పేలుడు

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బాంబు పేలుడు

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. యూనివర్సిటీ ఆవరణలో బుధవారం రాత్రి 12 గంటల సమయంలో రెండు నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనలో ఓ శునకం, వరాహం మృతి చెందాయి. యూనివర్సిటీ ఆవరణలోని ఐ బ్లాక్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది.  సమాచారం అందుకున్న వెంటనే క్యాంపస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఇంకేమైనా బాంబులు ఉన్నాయేమోనని క్షుణ్ణంగా గాలించారు. యూనివర్సిటీలో అడవి పందులను వేటాడేందుకే వేటగాళ్లు నాటు బాంబులను పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఘటనకు కారణమైన ఇద్దరు వేటగాళ్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.