TSPSC చైర్మన్ కు కోర్టు ధిక్కరణ నోటీసు

TSPSC చైర్మన్ కు కోర్టు ధిక్కరణ నోటీసు
  • ఈనెల 16న విచారణకు హాజరు కావాలని ఆదేశం

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ (టీఎస్ పీఎస్ సీ) జనార్దన్ రెడ్డికి హైకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి. ప్రస్తుతం విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది. ఓ కారుణ్య నియామకానికి సంబంధించిన ఓ వినతిపత్రంపై నిర్ణయం తీసుకోవాలన్న ఆదేశాలను అమలు చేయనందుకు నోటీసులు జారీ అయినట్లు సమాచారం. ఈ కేసు విషయంలో ఈనెల 16న విచారణకు హాజరు కావాలని అప్పటి విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డితోపాటు ప్రస్తుత విద్యాశాఖ ఎస్ కే సుల్తానియాకు హైకోర్టు ఆదేశాలిచ్చింది.