భారత్‌‌ భయపడొద్దు.. మీకు అండగా మేమున్నాం: ఇమ్రాన్ ఖాన్

భారత్‌‌ భయపడొద్దు.. మీకు అండగా మేమున్నాం: ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: భారత్‌‌లో కరోనా కేసులు పెరుగుతుండటంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి మీద పోరాటంలో ఇండియాకు అండగా ఉంటామని ఖాన్ అన్నారు. ‘ప్రమాదకర కరోనాపై పోరాటంలో భారత ప్రజలకు మేం సంఘీభావం తెలుపుతున్నాం. మా దాయాది దేశంతోపాటు మొత్తం ప్రపంచంలో మహమ్మారి బారిన పడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఈ గ్లోబల్‌‌ సవాల్‌‌ను మనమంతా ఏకమై ఎదుర్కోవాలి’ అని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. కాగా, భారత్‌‌లో కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌‌లో #IndiaNeedsOxygen, #PakistanStandsWithIndia, #IndiaFightsCovid హ్యాష్‌‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.