దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 20వేల కొవిఫర్(రెమ్డెసివిర్) ఇంజెక్షన్లను సిద్ధం చేస్తున్నామని హెటెరో హెల్త్కేర్ ప్రకటించింది. 100 మిల్లీ గ్రాముల ఇంజెక్షన్ను రూ.5,400కు అందిస్తున్నామని పేర్కొంది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తరువాత హెటెరో తొలి విడతలో 20 వేల ఇంజెక్షన్ల ను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.
20వేల ఇంజెక్షన్ల ను 10వేల శాంపిల్స్ చొప్పున ముంబై,ఢిల్లీ పంపిణీ చేస్తామన్నారు. ఆ తరువాత గుజరాత్, తమిళనాడు, హైదరాబాద్ తో పాటు కోల్కతా, ఇండోర్, భోపాల్, లక్నో, పాట్నా, భువనేశ్వర్, రాంచీ, విజయవాడ, కొచ్చిన్, త్రివేండ్రం, గోవా వారాల్లోపు సరఫరా చేయనున్నట్లు హెటెరో హెల్త్కేర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శ్రీనివాస రెడ్డి అన్నారు