తెలంగాణ ఇంచార్జి గవర్నర్ గా సీపీ రాధకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2024 మార్చి 20వ తేదీ ఉదయం11:15 నిమిషాలకు రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదె ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. సీపీ రాధాకృష్ణన్కు తెలంగాణతో పాటుగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గానూ బాధ్యతలు అప్పగించారు. కాగా 2023 ఫిబ్రవరి నుంచి సీపీ రాధకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు.
తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ 16 ఏండ్లకే ఆర్ఎస్ఎస్ లో చేరారు. జన్ సంఘ్, బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి 1998,1999లో బీజేపీ ఎంపీగా గెలిచి... 2004, 2009, 2019లో ఓడిపోయారు. తమిళనాడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా పని చేశారు. నిరుడు ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు.
కాగా, తెలంగాణకు వరుసగా తమిళనాడుకు చెందిన వ్యక్తులే గవర్నర్లుగా నియమితులవుతున్నారు. తెలంగాణ మొదటి గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ 2014 నుంచి 2019 వరకు పని చేయగా, ఆయన తర్వాత 2019 సెప్టెంబర్ నుంచి 2024 మార్చి వరకు తమిళిసై పని చేశారు.