
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ శివారు బొమ్మకల్లోని ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఎంబీఎ స్టూడెంట్లకు రుబికాన్ ఫౌండేషన్- బజాజ్ ఫిన్ సర్వ్ నిర్వహిస్తున్న సీపీబీఎఫ్ఐ కోర్సును శనివారం ఫౌండర్ చైర్మన్ మనోహర్ రెడ్డితో కలిసి చైర్మన్ ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్య సాధనకు ప్రత్యేక కోర్సులు ఎంతో దోహదపడతాయని వెల్లడించారు.
ఈ ప్రోగ్రాంలో భాగంగా 16 రోజుల పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్స్యూరెన్స్ , ఆప్టిట్యూడ్ , సాఫ్టు స్కిల్స్, తదితర రంగాల్లో ట్రైనింగ్,ఇంటర్వ్యూ స్కిల్స్ తో పాటు బజాజ్ ఫిన్ సర్వ్ పేరిట ఎన్ఎస్డీసీ సర్టిఫికేషన్ ఇస్తారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగేంద్రసింగ్, ఏవో రాజశేఖర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ కిశోర్, ఎంబీఏ హెచ్ఒడి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ జి.సంతోషి, డి.రజిత రెడ్డి, మహమ్మద్ ఇలియాస్ అలీ, మహమ్మద్ అజారుద్దీన్, సుప్రియ, స్టూడెంట్లు పాల్గొన్నారు.