రేపు సీపీజీఈటీ–2022 ఫలితాలు రిలీజ్

రేపు సీపీజీఈటీ–2022 ఫలితాలు రిలీజ్

హైదరాబాద్: రేపు సీపీజీఈటీ–2022 ఫలితాలను రిలీజ్ చేయనున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. రేపు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి చేతుల మీదుగా ఈ ఫలితాలను విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. పీజీకి సంబంధించిన పలు కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం సీపీజీఈటీ పేరుతో కామన్ ఎంట్రన్స్ నిర్వహిస్తోంది.

ఈ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు,  జేఎన్టీయూ, శాతవాహన యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో ప్రవేశం కల్పిస్తారు. గత నెల 11 నుంచి 23 వరకు సీపీజీఈటీ పరీక్షలు జరిగాయి. దాదాపు 67,027 మంది దరఖాస్తు చేసుకోగా 57,262 మంది హాజరయినట్లు అధికారులు తెలిపారు.