కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేది బీజేపీ సర్కారే: సీపీఐ నారాయణ

కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేది బీజేపీ సర్కారే: సీపీఐ నారాయణ

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ తన కుటుంబ సభ్యులను, కూతురును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రధాని మోదీ, అమిత్ షా చెప్తున్నారని, అయితే.. వారిని కాపాడేదీ బీజేపీ సర్కారేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలు ఆత్మస్థుతి పరనిందలా ఉన్నాయని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

లిక్కర్ స్కామ్‌‌లో రాజీ ఒప్పందం కుదిరిన తర్వాతే వైసీపీ, కేసీఆర్, బీజేపీ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని కుట్రపన్నారని ఆరోపించారు. అందరూ కలిసి కుమ్మక్కై మనీష్ సిసోడియాను కేసులో ఇరికించి జైల్లో పెట్టారన్నారు. ఇందులో మోదీ, అమిత్ షా భాగస్వాములు కాదా అని ఆయన ప్రశ్నించారు.