కేసీఆర్ ను కాపాడేందుకు సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్: సీపీఐ నారాయణ

కేసీఆర్ ను కాపాడేందుకు సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్: సీపీఐ నారాయణ

హైదరాబాద్​: కేసీఆర్ ను కాపాడేందుకు సీబీఐ విచారణ అంశాన్ని బీజేపీ తెరమీదకు తెస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్,​ బీజేపీకి మధ్య సయోధ్య ఉందని, అందుకే కవిత అరెస్టు కాలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ ఎందుకు చెయ్యలేదో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కాళేశ్వరం అవినీతిని బయటకు తీసుకొచ్చే ఉద్దేశ్యం బీజేపీకి లేదన్నారు. ఎలక్టోలర్ బాండ్లపై సుప్రీం కోర్టు తీర్పు ఆయన స్వాగతించారు. రాజకీయ వ్యవస్థను ధ్వంసం చేసేందుకే ఎలక్టోలర్ బాండ్లను తీసుకొచ్చారని విమర్శించారు.