హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీలో పేదలు, సామాన్యుల పక్షాన పోరాడేందుకు, వారి తరఫున బలమైన ప్రశ్నించే గొంతుకగా నిలి చేందుకు సీపీఐని గెలిపించాలని ఆ పార్టీ నేతలు కోరారు. బుధవారం మగ్ధుం భవన్లో సీపీఐ మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ కార్యదర్శులు నారాయణ, అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డి తదితరులు రిలీజ్ చేశారు.
జాతీయస్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్టు వారు చెప్పారు.