హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ హిల్ట్ పాలసీకి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు తెలిపారు. అయితే, ఈ విధానం అమలులో స్పష్టత ఉండాలని, ప్రభుత్వ భూములను అమ్మకూడదని ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో హిల్ట్ పాలసీ, తెలంగాణ రైజింగ్పాలసీ 2047 డాక్యుమెంట్పై జరిగిన చర్చలో మాట్లాడారు.
కాలుష్యం వల్ల ఢిల్లీ, హైదరాబా ద్ ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని కూనంనేని తెలిపారు. కాలుష్యం వల్లే సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి అనారోగ్యం పాలై మనకు దూరమయ్యారని చెప్పారు.
