ఉద్రిక్తంగా మారిన సీపీఐఎంఎల్ ప్రగతిభవన్ ముట్టడి

ఉద్రిక్తంగా మారిన సీపీఐఎంఎల్ ప్రగతిభవన్ ముట్టడి

సీపీఐఎంఎల్ ప్రగతిభవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. పోడు రైతులకు పట్టాలు ఇవ్వడంతోపాటు ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐఎంఎల్, పిడిఎస్ నేతలు ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. పొడు భూముల రైతులకు హక్కు పత్రాలను ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా పొడు భూముల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు. ఇక కౌలు రైతులకు రైతు బంధు, రైతు బీమా అందించడంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు.