
- సీఎం రేవంత్ రెడ్డికి సీపీఎం లేఖ
హైదరాబాద్, వెలుగు: గౌలిదొడ్డి, అలుగునూరు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ రెసిడెన్షియల్కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్చదివిన విద్యార్థులందరిని సెకండ్ ఇయర్ లో కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ సీఎం రేవంత్ రెడ్డికి శనివారం లేఖ రాశారు. ఫస్ట్ఇయర్లో 95శాతం మార్కులు వస్తేనే సెకండియర్ లో కొనసాగిస్తామనడం సరికాదని, ఈ నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్చేశారు.
ఈ గురుకుల కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు 2024 ఫిబ్రవరి 4, ఫిబ్రవరి 25న గురుకులాల సీవోఈ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని, దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా 95 శాతం మార్కులు వస్తేనే సెకండియర్ లో కొనసాగిస్తామని, లేదంటే వేరే చోటకు తరలిస్తామని చెప్పడం సరికాదన్నారు. విద్యార్థులు కళాశాలల్లో చేరే సమయంలో ఈ నిబంధన లేదనినవాపోయారు. ఇప్పటికే కొంతమంది బైపీసీ విద్యార్థులను ఏ సౌకర్యాలు లేని చోటుకు తరలించారన్నారు. ఈ నిర్ణయంతో దళిత, మైనారిటీ, వెనకబడిన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే గతంలో మాదిరిగానే ఈ కళాశాలల్లో విద్యా విధానాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.