- డబ్బు, న్యూడ్ వీడియోలు పంపించాలని బ్లాక్ మెయిల్
- నిందితుడిని అరెస్ట్ చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు
హైదరాబాద్, వెలుగు: అమ్మాయిల పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి, ఇన్స్టాగ్రామ్లో యువతులను ట్రాప్ చేస్తున్న బ్లాక్ మెయిలర్ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. న్యూడ్ ఫొటోస్,వీడియోల కోసం బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపిన ప్రకారం.. మేడ్చల్ జిల్లాకు చెందిన ఎస్. జిష్ణు కీర్తన్ రెడ్డి(28) ఇన్స్టాగ్రామ్లో యువతులను టార్గెట్ చేశాడు. ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి కాంటాక్ట్లోకి వచ్చిన యువతులు, మహిళలతో చాటింగ్ చేస్తున్నాడు. మైనర్ను బ్లాక్ మెయిల్ ఫేక్ ప్రొఫైల్తో యువతులను ట్రాప్ చేసి ప్రైవేట్ ఫొటోలు, వీడియోస్ సేకరించేవాడు.
ఆ తర్వాత వాటిని న్యూడ్గా మార్ఫింగ్ చేసేవాడు. అడిగినంత డబ్బు, న్యూడ్ వీడియోస్ పంపించకపోతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్నాడు. ఇలా సిటీకి చెందిన ఓ బాలిక(14)ను బ్లాక్ మెయిల్ చేశాడు. విషయం తెలియడంతో బాలిక తల్లి గత నెల 28న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేశారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఫోన్ నంబర్ ఆధారంగా జిష్ణు కీర్తన్ను బుధవారం అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.