బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేయడంతో కరీంనగర్ లో ఆయనపై కేసు నమోదైంది.  ఈనెల7న కరీంనగర్ లో కార్యకర్తలు, ముఖ్యనేతలతో ఎమ్మెల్యేలు కేటీఆర్, కౌశిక్ రెడ్డిలు సమావేశం నిర్వహించారు.  

ఈ సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. మేం మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తామని అప్పుడు పోలీసులకు వడ్డీతో సహా చెల్లిస్తామంటూ కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవర్నీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పోలీసులపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం  చేస్తూ.. పట్టణానికి చెందిన ఆశిష్ గౌడ్ అనే వ్యక్తి వన్ టౌన్  లీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశాడు.  

ALSO READ :- Bangalore Fan War: బెంగుళూరులో తెలుగు హీరోల ఫ్యాన్ వార్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీరంగం

 పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా కౌశిక్ రెడ్డి మాట్లాడారని.. ఆయన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపాడు. దీంతో కరీంనగర్ పోలీసులు కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.