సీటెట్​ నోటిఫికేషన్​ విడుదల

సీటెట్​ నోటిఫికేషన్​ విడుదల

కెరీర్‌‌‌‌లో టీచర్​గా స్థిరపడాలనుకునే వారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నిర్వహిస్తుంది. ఈ ఎగ్జామ్​ ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది. తాజాగా డిసెంబర్‌‌‌‌-2022 సంవత్సరానికి సీటెట్​ నోటిఫికేషన్​ విడుదలైంది. 16వ ఎడిషన్‌‌‌‌ సీటెట్‌‌‌‌ రిజిస్ట్రేషన్లు అక్టోబర్‌‌‌‌ 31 నుంచి ప్రారంభం కానున్నాయి.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: పరీక్ష మొత్తం రెండు పేపర్‌‌‌‌లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్​ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్​ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ లైఫ్​ లాంగ్​ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. 

అర్హతలు:

పేపర్-1: 50 శాతం మార్కులతో పన్నెండో తరగతితో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌‌‌‌లో రెండేళ్ల డిప్లొమా(డీఈఎల్‌‌‌‌ఈడీ)/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

పేపర్-2: 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌‌‌‌ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్(బీఈడీ)/ బీఈడీ(ప్రత్యేక విద్య) లేదా సీనియర్‌‌‌‌ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(బీఈఎల్‌‌‌‌ఈడీ)/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు అక్టోబర్​ 31 నుంచి నవంబర్​ 24 వరకు అప్లై చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు డిసెంబర్, 2022 నుంచి జనవరి, 2023 మధ్య నిర్వహిస్తారు. వివరాలకు www.ctet.nic.in వెబ్​సైట్​ సంప్రదించాలి.