- ఆఫ్రికన్ ఫేక్ కరెన్సీ ముఠా మాయాజాలం
- ఓ వ్యక్తి నుంచి రూ.5 లక్షలు దోపిడీ
- ఇద్దరి అరెస్ట్.. మరో ముగ్గురు పరారీలో
హైదరాబాద్, వెలుగు: ‘‘నల్ల కాగితంపై కెమికల్పోస్తే.. కరెన్సీ నోట్లు అయితయ్.. కావాలంటే ఈ డెమో చూడండి. వర్జినల్కరెన్సీ లక్ష ఇవ్వండి.. ఫేక్కరెన్సీ ఐదు లక్షలు తీస్కోండి” అంటూ నకిలీ నోట్లతో దోపిడీకి పాల్పడుతున్న ఆఫ్రికన్ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు సభ్యుల వెస్ట్ ఆఫ్రికన్ గ్యాంగ్లో మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు మంగళవారం ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. కేసు వివరాలను ఎస్ఓటీ డీసీపీ గిరిధర్తో కలిసి రాచకొండ సీపీ సుధీర్బాబు బుధవారం వెల్లడించారు.
వాట్సాప్గ్రూపులో డెమో చూపి..
కామెరూన్ దేశానికి చెందిన కొంబి ఫ్రాంక్ సెద్రిక్(35)గత మూడేండ్లుగా గుర్గావ్లో ఉంటున్నాడు. మరో ఇద్దరు ఆఫ్రికన్స్ గొయిట సౌంగల(52), రొలాక్స్(43) బెంగళూరులో ఉంటున్నారు. వీరంతా స్టూడెంట్ వీసాపై ఇండియాకు వచ్చి గడువు ముగిసినా ఇంకా ఇక్కడే ఉంటున్నారు. ఈ ముగ్గురు మరో నైజీరియన్జోసఫ్తో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. వెస్ట్ఆఫ్రికాకు చెందిన డేవిడ్అనే వ్యక్తి ‘వెరిఫైడ్క్లోన్క్రెడిట్కార్డ్’ పేరుతో వాట్సాప్గ్రూప్క్రియేట్చేశాడు. ఢిల్లీ, ముంబయి, కోల్కతా, హైదరాబాద్కు చెందిన వారి నెంబర్లను సేకరించి వీరంతా ఆ వాట్సాప్గ్రూపులో జాయిన్ చేస్తారు. తమ వద్ద బ్లాక్ కరెన్సీ ఉందని, నల్ల కాగితాలపై కెమికల్పోసి క్లీన్ చేస్తే ఇండియన్కరెన్సీలో రూ.500 వర్జినల్ నోట్లు తయారవుతాయని డెమో వీడియోలు వాట్సాప్లో పెట్టేవారు. రూ.లక్ష ఇస్తే రూ.5 లక్షలు విలువ చేసే బ్లాక్ పేపర్స్(ఫేక్ కరెన్సీ) ఇస్తామని చెప్పేవారు. ఆ బ్లాక్ పేపర్స్ను వర్జినల్ నోట్స్గా మార్చుకుని చెలామణి చేసుకోవచ్చని ఆశ చూపేవారు. ఎవరైనా వీరిని సంప్రదిస్తే.. అప్పటికే నల్ల రంగు పూసిన వర్జినల్ ఇండియన్కరెన్సీ నోటుపై కెమిక్ పోసి క్లిన్ చేసి వర్జినల్నోట్ తయారైందని డెమో చేసి చూపేవారు. తాము ఇచ్చే నల్ల కాగితాలపై రహస్యంగా కెమికల్పోసి క్లీన్ చేసుకోవాలని చెప్పేవారు. వర్జినల్కరెన్సీ తీసుకొని అక్కడి నుంచి ఉడాయించేవారు. ఎవరికైనా సందేహం వచ్చి అక్కడే టెస్ట్చేసుకుంటే.. వారిపై మత్తుమందు చల్లి క్యాష్తో
పారిపోయేవారు.
రూ.5 లక్షలు కొట్టేసి దొరికారు
బోడుప్పల్కు చెందిన జొమాటో డెలివరీ బోయ్ విష్ణువర్ధన్ రెడ్డి నెంబర్ ‘వెరిఫైడ్ క్లోన్ క్రెడిట్ కార్డ్’ గ్రూప్లో యాడ్అయింది. అందులోని డెమో చూసిన విష్ణువర్ధన్రెడ్డితో నిందితుడు డేవిడ్చాటింగ్ చేశాడు. తమ వద్ద బ్లాక్ కరెన్సీ నోట్స్ ఉన్నాయని 1:5 రేషియో ప్రకారం డీల్ సెట్ చేశాడు. రోలెక్స్ అనే వ్యక్తి వచ్చి డెమో ఇస్తాడని చెప్పాడు. డిసెంబర్29న మెహిదీపట్నంలో విష్ణువర్ధన్రెడ్డిని రోలెక్స్ కలిశాడు. కొన్ని బ్లాక్ పేపర్ను కెమికల్తో క్లియర్ చేసి వర్జినల్ నోట్గా చూపించాడు. పూర్తిగా నమ్మిన విష్ణువర్ధన్రెడ్డి ఈ నెల 5వ తేదీన మాదాపూర్లోని ఓ హోటల్లో జోసఫ్, కొంబి ఫ్రాంక్ సెద్రిక్లను కలిసి డీల్ ప్రకారం రూ.5 లక్షలు ఇచ్చి, రూ.25 లక్షలు విలువ అని నమ్మించిన బ్లాక్ పేపర్స్(ఫేక్ కరెన్సీ) బండిల్స్ తీసుకున్నాడు. ఇంటికి వెళ్లి చెక్చేయగా.. అంతా ఫేక్అని తేలింది. మోసపోయాననని గుర్తించిన బాధితుడు మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టి కొంబి ఫ్రాంక్ సెద్రిక్, గొయిట సౌంగలను మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఫేక్కరెన్సీ బండిల్స్, కెమికల్స్స్వాధీనం చేసుకున్నారు.