తెలంగాణలో కరెంట్ వాడకం కోటిన్నర యూనిట్లు పెరిగింది

తెలంగాణలో కరెంట్ వాడకం కోటిన్నర యూనిట్లు పెరిగింది
  • ప్రతిరోజు 300 మిలియన్ యూనిట్లకు పైనే సరఫరా
  • ఎండల తీవ్రత, అగ్రికల్చర్ వినియోగం పెరగడంతో ఫుల్ డిమాండ్
  • పవర్ బ్యాంకింగ్ పాలసీతో డిమాండ్ కు సరిపడా సరఫరా చేస్తున్న డిస్కమ్​లు 
  • గతంలో కంటే అగ్గువకే కరెంట్ కొనుగోలు  

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో కరెంట్ వినియోగం భారీగా పెరిగింది. పోయినేడాది మార్చితో పోలిస్తే ఈసారి మార్చిలో సగటున కోటిన్నర యూనిట్ల దాకా వాడకం ఎక్కువైంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిరోజు 300 మిలియన్ యూనిట్లకు పైనే కరెంట్ సరఫరా జరుగుతున్నది. పోయినేడాది మార్చిలో 300 మిలియన్ యూనిట్లు దాటని కరెంట్ వినియోగం.. ఈసారి అత్యధికంగా 308 మిలియన్ యూనిట్లు నమోదైంది. ఎండల తీవ్రత కారణంగా పట్టణాలు, గ్రామాల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం పెరగడం.. మరోవైపు పంటల సాగుకు కూడా కరెంట్ వినియోగం పెరగడంతో పీక్ డిమాండ్ నమోదవుతున్నది. దీంతో కరెంట్ వినియోగంలో పాత రికార్డులన్నీ చెరిగిపోతూ, కొత్త రికార్డులు నమోదవుతున్నాయి.  

గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో 30 శాతం పెరుగుదల.. 

రాష్ట్రంలో అత్యధికంగా గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో కరెంట్ వినియోగం భారీగా పెరిగింది. పోయినేడాది మార్చితో పోలిస్తే ఈసారి 30 శాతానికి పైగా కరెంట్ వినియోగం పెరిగినట్టు టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్పీడీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్గాలు పేర్కొన్నాయి. గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో పోయినేడాది మార్చి 12న 52.95 మిలియన్ యూనిట్లు వాడితే, ఈ ఏడాది అదే రోజున 72.73 మిలియన్ యూనిట్ల వాడకం జరిగింది. అదే విధంగా పోయినేడాది మార్చి 13న 57.79 ఎంయూలు వాడితే, ఈసారి అదే రోజున 72.73 ఎంయూలు.. పోయినేడాది మార్చి 14న 58.97 ఎంయూలు వాడితే, ఈసారి 75.67 ఎంయూలు.. పోయినేడాది మార్చి 15న 59.83 ఎంయూలు వాడితే, ఈసారి 74.94 ఎంయూలు వినియోగమైంది. 

యూనిట్ ఖర్చు రూ.5.. 

కరెంట్ కు ఫుల్ డిమాండ్ ఉన్నప్పటికీ, డిమాండ్ కు సరిపడా మన డిస్కమ్స్ సరఫరా చేస్తున్నాయి. అంతేకాకుండా కరెంట్ వినియోగం భారీగా పెరిగినా, కొనుగోలు ఖర్చు మాత్రం సగానికి తగ్గింది. ఇదంతా పవర్ బ్యాంకింగ్ పాలసీతోనే సాధ్యమవుతున్నది. మన దగ్గర కరెంట్ తక్కువున్నప్పుడు ఇతర రాష్ట్రాల దగ్గరి నుంచి సేకరించడం, మన దగ్గర కరెంట్​ఎక్కువున్నప్పుడు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయడమే పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలసీ విధానం.

ఇప్పుడీ పాలసీ మన రాష్ట్రంలో అమలవుతున్నది. దీని ఆధారంగా హర్యానా, ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కరెంట్ సేకరిస్తున్నారు. గతంలో ఇలా పీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నప్పుడు ఒక్కో యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు రూ.10 ఖర్చు చేసేవారు. ఇప్పుడు పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలసీని అమలు చేస్తుండడంతో యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరెంట్ ను రూ.5కే కొనుగోలు చేస్తున్నారు. దీంతో కరెంటు వినియోగం భారీగా పెరిగినా, ఖర్చు భారం సగానికి తగ్గిందని డిస్కమ్ వర్గాలు అంటున్నాయి. కొత్త పాలసీతో డిమాండ్ కు సరిపడా కరెంటు సరఫరా చేయగులుతున్నామని పేర్కొంటున్నాయి.