నా తమ్ముడితో బంధుత్వాన్ని తెగదెంపులు చేసుకుంటున్నా : మమతాబెనర్జీ

నా తమ్ముడితో బంధుత్వాన్ని తెగదెంపులు చేసుకుంటున్నా  :  మమతాబెనర్జీ

తన తమ్ముడిపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. లోక్​సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికను తీవ్రంగా తప్పుబట్టిన తన సోదరుడు బాబూన్​ బెనర్జీతో బంధుత్వం కట్​ చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఎన్నికలకు ముందు ఎప్పుడూ ఏదో ఒక రకమైన గొడవలకు తెరతీస్తారంటూ బాబూస్ బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గల ప్రధాన కారణాన్ని కూడా ఆమె జల్పాయిగుడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. 

'తృణమూల్​ కాంగ్రెస్​ హవ్​డా లోక్​సభ టికెట్​ను తన తమ్ముడు బాబూన్​ బెనర్జీని కాదని పార్టీలో మరో ముఖ్య నేతగా కొనసాగుతున్న ప్రసూన్​ బెనర్జీకి కేటాయించామన్నారు. ఇది బాబూన్​కు ఏ మాత్రం మింగుడుపడటం లేదని, పైగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారని ఫైర్ అయ్యారు.

అత్యాశపరులను తాను ఆదరించనని చెప్పారు. వారసత్వ రాజకీయాలను తాను నమ్మనని, వాటికి  దూరంగా ఉంటానని తెలిపారు. అందుకే తన తమ్ముడికి టికెట్​ ఇవ్వలేదని, ఇక ఆయనతో పూర్తిగా బంధుత్వాన్ని తెగదెంపులు చేసుకుంటున్నానని చెప్పుకొచ్చారు.