తన తమ్ముడిపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికను తీవ్రంగా తప్పుబట్టిన తన సోదరుడు బాబూన్ బెనర్జీతో బంధుత్వం కట్ చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఎన్నికలకు ముందు ఎప్పుడూ ఏదో ఒక రకమైన గొడవలకు తెరతీస్తారంటూ బాబూస్ బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గల ప్రధాన కారణాన్ని కూడా ఆమె జల్పాయిగుడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు.
'తృణమూల్ కాంగ్రెస్ హవ్డా లోక్సభ టికెట్ను తన తమ్ముడు బాబూన్ బెనర్జీని కాదని పార్టీలో మరో ముఖ్య నేతగా కొనసాగుతున్న ప్రసూన్ బెనర్జీకి కేటాయించామన్నారు. ఇది బాబూన్కు ఏ మాత్రం మింగుడుపడటం లేదని, పైగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారని ఫైర్ అయ్యారు.
అత్యాశపరులను తాను ఆదరించనని చెప్పారు. వారసత్వ రాజకీయాలను తాను నమ్మనని, వాటికి దూరంగా ఉంటానని తెలిపారు. అందుకే తన తమ్ముడికి టికెట్ ఇవ్వలేదని, ఇక ఆయనతో పూర్తిగా బంధుత్వాన్ని తెగదెంపులు చేసుకుంటున్నానని చెప్పుకొచ్చారు.