V6 News

సీఐని మాట్లాడుతున్న.. రూ.20 వేలు ఫోన్పే చెయ్యి..సైబర్ చీటర్ చేతిలో మోసపోయిన పెట్రోల్ బంక్ మేనేజర్

సీఐని మాట్లాడుతున్న..  రూ.20 వేలు ఫోన్పే చెయ్యి..సైబర్ చీటర్ చేతిలో మోసపోయిన పెట్రోల్ బంక్ మేనేజర్

 కీసర, వెలుగు: సీఐ పేరుతో ఫోన్​ చేసి పెట్రోల్​ బంక్​ మేనేజర్​ వద్ద ఓ సైబర్​ చీటర్​ డబ్బులు కొట్టేశాడు. కీసర పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బోగారం వై ఎస్ ఆర్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ లో హనుమంత్ రావు మేనేజర్​గా పనిచేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయనకు సీఐ సురేశ్​కుమార్ పేరుతో ఫోన్​ కాల్​ వచ్చింది. తాను కీసర సీఐ లక్ష్మణ్  అని పరిచయం చేసుకున్నాడు. రూ.20 వేలు ఫోన్​ పే చేయాలని, సాయంత్రం తన మనిషి వచ్చి డబ్బులు ఇస్తాడని నమ్మించాడు. దీంతో బంక్​ మేనేజర్ గుర్తు తెలియని ఆ ఫోన్ నంబర్ కి రూ.20 వేలు ఫోన్​ పే ద్వారా  పంపించాడు. సాయంత్రం ఎవరూ డబ్బులు తెచ్చి ఇవ్వకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. గురువారం ఉదయం కీసర పోలీస్ స్టేషన్లో బాధితుడు హనుమంత్ రావు ఫిర్యాదు చేశాడు.సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేశారు.