రూ.1.62 కోట్లు కాజేసిన కేసులో..  సైబర్  స్కామర్ అరెస్ట్

రూ.1.62 కోట్లు కాజేసిన కేసులో..  సైబర్  స్కామర్ అరెస్ట్

ఖమ్మం, వెలుగు: ఆన్ లైన్​లో ట్రేడింగ్ పేరుతో నమ్మించి రూ.1.62 కోట్లు కాజేసిన కేసులో నిందితుడిని నాగర్ కర్నూల్ లో ఖమ్మం సైబర్  క్రైం పోలీసులు అరెస్ట్​ చేశారు. ఖమ్మం సీపీ సునీల్ దత్  తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా బోనకల్ కు చెందిన సాఫ్ట్ వేర్​ ఉద్యోగికి కొందరు ఫోన్​ చేసి, ఆన్​లైన్ లో ట్రేడింగ్, ఇన్వెస్ట్​మెంట్  చేస్తే లాభాలు ఎక్కువగా వస్తాయని ఆశ చూపించారు. వాట్సప్, ట్రేడింగ్  లింకులు పంపించి రూ.1.62 కోట్లు కాజేశారు.

దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో నిందితుడైన నేనావత్  అఖిల్(23)ను నాగర్ కర్నూల్ లో అరెస్ట్​ చేసి ఖమ్మం సైబర్  క్రైం కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్  చేసినట్లు  సీపీ తెలిపారు.