కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కరోనా సోకి రికవరీ అయిన వారందరికీ సైబరాబాద్ పోలీస్ తరుపున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా మంది కరోనాతో ఆస్పతుల్లో అడ్మిట్ అవుతున్నారని… కరోనా వైరస్ రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుందని అన్నారు. ఈ కోవిడ్ 19 బారిన పడి బయట పడిన వారు ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వాలని కోరారు.
“మీరు ఇచ్చే 500 ఎమ్ఎల్తో ఇద్దరు రోగులను కాపాడిన వారు అవుతారు. ఇప్పటికే ఎంతో మంది పోలీసులు కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. సైబరాబాద్ పోలీసులు ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వడానికి అంగీకరించారు.దీంతో ముగ్గురిని ఆదుకున్నారు. తెలిపారు. మూడు కుటుంబాలను కాపాడారని” అన్నారు. ఎవరైనా ప్లాస్మా ఇవ్వాలనుకున్నవారు 9490617440కి సమాచారం ఇవ్వాలని సీపీ పేర్కొన్నారు.