లా అండ్ ఆర్డర్ కు కేసీఆర్ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు : సీపీ స్టీఫెన్ రవీంద్ర

లా అండ్ ఆర్డర్ కు కేసీఆర్ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు : సీపీ స్టీఫెన్ రవీంద్ర

సంగారెడ్డి జిల్లా : రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లపూర్ లో నాలుగు పెట్రోలింగ్ వాహనాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు. గచ్చిబౌలి, గౌలిదొడ్డి, నల్లగండ్ల, గోపాన్ పల్లిలో నాలుగు పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించామని తెలిపారు.

తెల్లపూర్ పరిధిలో క్రైమ్ రేటును తగ్గించడానికి పెట్రోలింగ్ వాహనాలు ఏర్పాటు చేశామని చెప్పారు. లా అండ్ ఆర్డర్ కు సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.