సైబర్​ క్రైమ్ ​కేసులు.. రోడ్డు యాక్సిడెంట్లు​పెరిగినయ్​

సైబర్​ క్రైమ్ ​కేసులు.. రోడ్డు యాక్సిడెంట్లు​పెరిగినయ్​
  •     రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో రూ. 11.62కోట్ల గంజాయి సీజ్​ 
  •     ఈ ఏడాది క్రైమ్​ రివ్యూలో భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ డాక్టర్​ వినీత్ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఈ ఏడాదిలో సైబర్​ క్రైమ్స్, ఘోరమైన రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. లాస్ట్​ ఇయర్​ కంటే ఈ సంవత్సరం క్రైమ్​ రేట్​ పెరిగింది. ఈ ఏడాదికి సంబంధించిన క్రైమ్​ వివరాలను ఎస్పీ డాక్టర్​ వినీత్ గురువారం మీడియాకు వివరించారు. గతేడాది 5,274కేసులు నమోదు కాగా, ఈసారి 5,293 కేసులు నమోదయ్యాయి.

సైబర్​ క్రైమ్​ కేసులు లాస్ట్​ ఇయర్​తో పోలిస్తే ఎక్కువయ్యాయి. లాస్ట్​ ఇయర్​ 117సైబర్​ క్రైమ్​ కేసులు నమోదు కాగా,  ఈ ఏడాది 138 కేసులు నమోదయ్యాయి. సైబర్​మోసగాళ్ల చేతిలో జిల్లా వాసులు దాదాపు రూ. 4.76కోట్ల మేర నష్టపోయారు. రూ. 76.24లక్షలను పోలీసులు ఫ్రీజ్​ చేశారు. దాదాపు రూ. 91వేలను సైబర్​ నేరస్థుల నుంచి కాపాడి బాధితులకు అప్పగించారు. రోడ్డు ప్రమాదాలు గతేడాది 194 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 216 కేసులు నమోదయ్యాయి.

ఎస్సీ, ఎస్టీ కేసులు లాస్ట్​ ఇయర్​ 78 నమోదు కాగా, ఈ ఏడాది 84, మహిళా వేధింపు కేసులు లాస్ట్​ఇయర్​ 689 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం 739 కేసులు నమోదయ్యాయి. లాస్ట్​ ఇయర్​ 21 మర్డర్లు కాగా ఈ ఏడాది 26 మర్డర్లు జరిగాయి.

లాస్ట్​ ఇయర్​తో పోలిస్తే 23.8శాతం మర్టర్​ కేసులు పెరిగాయి. రాత్రి దొంగతనాలు గతేడాది 127 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 137కేసులు నమోదయ్యాయి.  పగటి దొంతనాలు మాత్రం తగ్గాయి. రేప్​ కేసులు గతేడాది 61 నమోదు కాగా, ఈ ఏడాది 57 నమోదయ్యాయి. ఈ ఏడాదిలో 379 కేసులకు సంబంధించి దాదాపు రూ. 4.27కోట్ల మేర ప్రాపర్టీ లాస్​ కాగా,  228 కేసులకు చెందిన దాదాపు రూ.1.23కోట్ల ప్రాపర్టీని రికవరీ చేశారు. 

రికార్డు స్థాయిలో గంజాయి సీజ్..

రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 73 కేసులకు సంబంధించి రూ. 11.62కోట్ల విలువైన 4,734 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ ​చేశారు. ఈ కేసుల్లో 142 మందిని అరెస్ట్​ చేశారు. గంజాయి కేసులు లాస్ట్​ ఇయర్​తో పోలిస్తే దాదాపు 48.4శాతం పెరిగాయి. లాస్ట్​ ఇయర్​ డ్రైంకెన్​ డ్రైవ్​ కేసులు 12,608 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 14,629 కేసులు నమోదయ్యాయి.

ఈ ఏడాదిలో 9 కేసులకు సంబంధించి జీవిత ఖైదు శిక్షలు పడ్డాయి. మావోయిస్టుల కట్టడిలో జిల్లా పోలీసులు సక్సెస్​ అయ్యారు. ఐదుగురు మావోయిస్టులు సరెండర్​ అయ్యారు. నక్సల్స్​తో పాటు మిలీషియా మెంబర్స్​, కొరియర్స్, సానుభూతి పరులు మొత్తం 80 మందిని అరెస్టు చేశారు. జనరల్​ఎలక్షన్స్​లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారన్నారు.