సిటీ నెట్వర్క్, వెలుగు: సైబర్నేరాలపై అవగాహన కల్పించేందుకు బుధవారం నాలుగు పోలీస్కమిషనరేట్ల పరిధిలో సురక్షా కా త్రివర్ణ.. సైబర్స్వతంత్ర తెలంగాణ దిశగా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబరాబాద్కమిషనరేట్పరిధిలోని గచ్చిబౌలి ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో సినీ నటి అంజలితో పాటు సీపీ రమేశ్, సైబరాబాద్ట్రాఫిక్జాయింట్సీపీ సన్ప్రీత్సింగ్పాల్గొన్నారు.
వికారాబాద్జిల్లా తాండూరులో చౌరస్తా నుంచి సెయింట్ మార్క్ స్కూల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. తర్వాత నిర్వహించిన సమావేశానికి ఎస్పీ స్నేహా మెహ్రా హాజరయ్యారు. డీఎస్పీ నర్సింగ్యాదయ్య, సీఐ పరమేశ్వర్, రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
