సొంతగూటికి చేరిన సీనియర్ నేత డీఎస్

సొంతగూటికి చేరిన సీనియర్ నేత డీఎస్

సీనియర్ నేత డీ. శ్రీనివాస్ తిరిగి సొంతగూటికి చేరారు. డీఎస్ తో పాటు ఆయన పెద్ద కొడుకు సంజయ్ కాంగ్రెస్ లో చేరారు.  కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్  మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ పార్టీలోకి ఆహ్వానించారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

https://www.facebook.com/watch/?v=224470860248933

 అంతకు ముందు డీఎస్ కాంగ్రెస్ లో  చేరికపై ట్విస్ట్ ల మీద ట్విస్టులు వచ్చాయి.  తాను కాంగ్రెస్ లో చేరడం లేదని  మార్చి 26న ఉదయం డీఎస్ పేరిట ఓ లేఖ రిలీజయింది.  ఈ లేఖలో  తన పెద్ద కొడుకు సంజయ్ తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నారని స్పష్టం చేశారు.  కాంగ్రెస్ లో చేరనున్న తన పెద్ద కొడుకు సంజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. తన ఆరోగ్యం సహకరిస్తే గాంధీ భవన్ కు వెళ్లి సంజయ్ ని  ఆశీర్వదీస్తానని చెప్పారు.  ఇప్పటికే తన చిన్న కొడుకు అర్వింద్ ఎంపీగా ప్రజాసేవలో ఉన్నాడని చెప్పారు.  తన కుమారులు ఎక్కడున్నా వారికి తన ఆశీస్సులుంటాయని తెలిపారు. పార్టీలు వేరైనా తన కుమారులు ప్రజల కోసం పనిచేస్తున్నారని వెల్లడించారు. మళ్లీ కాసేపటికే గాంధీ భవన్ కు వీల్ చైర్ లో వచ్చిన డీఎస్ కాంగ్రెస్ లో చేరారు.