ఆ వీధిలో వెళ్తుంటే రోడ్డుకు ఇరువైపులా డైనోసర్లు, డ్రాగన్లు, తాబేళ్లు, బైక్లు వంటి కళాకృతులు కనిపిస్తుంటాయి. అటు వైపు వెళ్లే వారు ఆగి మరి వాటితో సెల్ఫీలు తీసుకుంటున్నారు. మహారాష్ట్రలోని వర్ధాలో ఓ పంక్చర్ షాపు యజమాని పాత టైర్లతో వివిధ కళాకృతులను చేసి ఔరా అనిపిస్తున్నాడు.
పాడైపోయిన పాత టైర్లతో వివిధ కళాకృతులను తయారు చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు వర్ధాకు చెందిన దాబిర్ షేక్. టైర్లకు పంక్చర్లు వేస్తూనే తనలోని కళతో స్వచ్ఛత, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. వర్ధాలో దాబిర్ షేక్ అనే వక్తి పంక్చర్ షాపు నడుపుతున్నారు. దుకాణంలో చాలా టైర్లు పేరుకుపోయాయి. చాలా మంది ఇలా పోగైన టైర్లను చెత్త కుప్పలో లేదంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. వాటిలో వర్షం నీరు చేరి దోమలకు ఆవాసంగా మారతాయి. కాల్చితే కాలుష్యానికి కారణమవుతాయి. ఈ సమస్యను అర్థం చేసుకున్న దాబిర్ షేక్.. వాటితో ఏదైనా కొత్తగా చేసి ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించాలనుకున్నారు.
Maharashtra | Wardha's Dabir Sheikh, who owns a puncture repair shop creates art from discarded tyres
— ANI (@ANI) June 12, 2022
"People started liking them so I kept making them. It's also helping in maintaining cleanliness. I've made various designs including dragon, turtle," he said pic.twitter.com/GgpT3P2VL7
పాత టైర్లను ఉపయోగించి వివిధ రకాల ఆకృతులను సృష్టించి ప్రదర్శించాలనుకున్నారు. పాడైపోయిన పాత టైర్లతో ఖాళీ సమయాల్లో వివిధ కళాకృతులను తయారు చేస్తున్నారు. టైర్లకు పంక్చర్లు వేస్తూనే తనలోని కళతో పరిశుభ్రత, స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తున్నారు. పలు కళాఖండాలకు రూపం ఇచ్చి తన దుకాణం ముందు రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేశారు. ఆ వైపునకు వెళ్లేవారు వాటిని చూసి తమ సెల్ ఫోన్లతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. దాబిర్ షేక్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
టైర్లను బయట పారేయటం ద్వారా అందులో నీరు నిలిచి అపరిశుభ్రతకు కారణమవుతుందని తెలిసిన ప్రజలు తమ ఇళ్లల్లో ఉన్న పాత టైర్లను తన వద్దకు తీసుకువచ్చి, వివిధ కళాకృతులను తయారు చేయించుకుని ఇంట్లో వాడుకునేందుకు తీసుకెళ్తున్నారని దాబిర్ షేక్ చెబుతున్నారు.