సర్వేకు వచ్చిన తహసీల్దార్ను అడ్డుకున్న దళితులు 

సర్వేకు వచ్చిన తహసీల్దార్ను అడ్డుకున్న దళితులు 

మంచిర్యాల జిల్లా: పార్కుల పేరుతో తమ భూములు లాక్కోవాలని చూస్తున్నారంటూ కోటపల్లి మండలం బబ్బర చెలుక గ్రామంలో దళితులు ఆందోళన చేపట్టారు. సర్వే కోసం వచ్చిన తహసీల్దార్ ను అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. 2004వ సంవత్సరంలో తమకు ప్రభుత్వం కేటాయించిన భూములను పార్కుల పేరిట ఇప్పుడు లాక్కుంటున్నారని ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు దళితులు. భూమి కేటాయించినప్పటికి ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోవడంతో ఖాళీగా వున్న ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. దీంతో అధికారులు భూములను స్వాధీనం చేసుకునేందుకు సర్వే కోసం రాగా.. దళితులు గుర్తించి అధికారులను అడ్డుకున్నారు. తమకు పట్టాలు ఇవ్వకపోగా.. తిరిగి వెనక్కి తీసుకోవడం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.