లిఫ్ట్​ ఇరిగేషన్​ నిర్వహణ బాధ్యత రైతులదే : దామోదర రాజనర్సింహ

లిఫ్ట్​ ఇరిగేషన్​ నిర్వహణ బాధ్యత రైతులదే : దామోదర రాజనర్సింహ

రాయికోడ్, వెలుగు: వర్షాధార పంటలు సాగు చేస్తున్న భూములకు లిఫ్ట్​ ఇరిగేషన్  ద్వారా నీరందిస్తామని, నిర్వహణ బాధ్యత రైతులు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా రాయికోడ్, సింగితం, బొగ్గులంపల్లి, కర్చల్, యూసుఫ్ పూర్, ధర్మాపూర్, అల్లాపూర్, శంషోద్దీన్ పూర్, చిమ్నాపూర్​ గ్రామాల్లో మంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదేండ్ల కింద తాను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు రూ.18 కోట్లతో బొగ్గులంపల్లి లిఫ్ట్ ను నిర్మించినట్లు పేర్కొన్నారు. దానిని బీఆర్ఎస్  ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో నిరుపయోగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్​ పంప్​సెట్లు, ట్రాన్స్​ఫార్మర్లు దొంగిలించినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బొగ్గులంపల్లి లిఫ్ట్​ కోసం రూ.2.16 కోట్లతో పనులు చేసి నీరందిస్తున్నట్లు తెలిపారు. 

మరో 3 కిలోమీటర్ల మేర కెనాల్,​ పైప్​లైన్​ ఏర్పాటుకు ప్రపోజల్స్​ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని రైతులు పార్టీలకతీతంగా సొసైటీని ఏర్పాటు చేసుకొని ప్రాజెక్టును కాపాడుకోవాలని సూచించారు. అనంతరం మోడల్​స్కూల్​ విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అడిషనల్​ కలెక్టర్​ చంద్రశేఖర్, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, ఆర్డీవో రాజు, ఎస్ఈ మురళీధర్, డీఎంహెచ్​వో గాయత్రి, జడ్పీటీసీ మల్లికార్జున్​పాటిల్, ఎంపీపీ మమత,  తహసీల్దార్​ శ్రీనివాస్, ఎంపీడీవో ఎంఎం షరీఫ్, కాంగ్రెస్​ నాయకులు అంజయ్య, నర్సింలు, ప్రభాకర్,కేదార్​నాథ్, శశికాంత్, మహంకాళి, సతీశ్​ పాల్గొన్నారు. ​​​​