రేవంత్ ఫ్లెక్సీ కాల్చేసిన దండెం అనుచరులు

 రేవంత్ ఫ్లెక్సీ కాల్చేసిన దండెం అనుచరులు

హైదరాబాద్: ఇబ్రహీం పట్నం టికెట్ ఆశించి భంగపడ్డ దండెం రాంరెడ్డి అనుచరులు గాంధీ భవన్ లో హంగామా చేశారు. ఇవాళ మధ్యాహ్నం గాంధీభవన్ కు వచ్చిన నాయకులు కుర్చీలు ఎత్తేసి రచ్చ చేశారు. రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని తగుల బెట్టారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన దండెం రాంరెడ్డికి టికెట్ఇవ్వకపోవడంతోనే వారు ఈ దాడికి పాల్పడ్డారు. మల్ రెడ్డి రంగారెడ్డికి ఇచ్చిన టికెట్ ను రద్దు చేయాలని, దండెం రాంరెడ్డికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

ALSO READ : కాంగ్రెస్ లీడర్లే టార్గెట్ గా ఐటీ రెయిడ్స్