దాసరి ఫిల్మ్ అవార్డ్స్

దాసరి ఫిల్మ్ అవార్డ్స్

దర్శక రత్న దాసరి నారాయణరావు 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆయన శిష్యులు సన్నాహాలు చేస్తున్నారు.  మే 5న శిల్పకళా వేదికలో నిర్వహించనున్న ఈ వేడుక వివరాలు వెల్లడించేందుకు గురువారం ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ,  దర్శకులు రేలంగి నరసింహారావు, నిర్మాత సి.కళ్యాణ్ అధ్యక్ష కార్యదర్శులుగా ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేశారు. తెలుగు సినిమా రంగానికి చెందిన వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచినవారికి  అవార్డులను అందజేసి, దాసరికి ఘన నివాళులు అర్పించనున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు.