
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. చంద్రబాబు సంక నాకుతున్నప్పుడు ..నేను రోడ్ల మీద ఉద్యమం చేశానంటూ తలసానిపై ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన టీఆర్ఎస్ కు చెంచాగా మారావంటూ ఘాటుగా విమర్శించారు.
అంతేకాదు మంత్రి కేటీఆర్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేవారు దాసోజు. పదో తరగతి ఫెయిల్ అయ్యి… గల్లీల్లో తిరిగే ఆకు రౌడీ..ఆలుగడ్డల శ్రీనివాస్ తో తిట్టిస్తావా అంటూ ప్రశ్నించారు. చర్చకు వచ్చే దమ్ము కేటీఆర్కు లేదు.. కానీ… ఉద్యోగాలు అడిగితే మేం గొట్టం గాళ్లం అయ్యామా అని అన్నారు. ఈ గొట్టం గాని కోసమే కేటీఆర్ నా ఇంటికి మూడు సార్లు వచ్చాడు.. టీఆర్ఎస్లో చేరమని అంటూ గుర్తు చేశారు. తలసాని ఓ సన్నాసి.. తల లేని శ్రీనివాస్ యాదవ్ అంటూ ఫైర్ అయిన ఆయన.. నువ్వు చంద్రబాబు సంక నాకుతున్నప్పుడు.. నేను రోడ్ల మీద ఉద్యమం చేసిన.. ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగే వాడు గొట్టం గాడు అయ్యాడా? పదో తరగతి ఫెయిల్ అయినవాడికి.. నీకు నిరుద్యోగుల బాధ ఎలా తెలుస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన నువ్వు… టీఆర్ఎస్కి చెంచావి.. పైసలిచ్చి టీఆర్ఎస్లో చేరిన నువ్వా.. నన్ను గొట్టంగాడు అని అనేది అంటూ ఫైర్ అయ్యారు శ్రవణ్.. నీ లెక్క పదవుల కులం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఉద్యమకారుల పార్టీలో తలసాని లాంటి లఫంగిలు చేరారని అన్నారు. నేను గొట్టం గాన్నో.. కాదో.. కేసీఆర్ ని అడుగు అంటూ సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో.. కేసీఆర్తో కలిసి చర్చల్లో పాల్గొన్న ఫొటోలను ఈ సందర్భంగా మీడియాకు చూపించిన శ్రవణ్.. తెలంగాణ ఎలా ఉండాలో కార్యాచరణ రూపొందించిన వాళ్లలో తాను ఒకడినని గుర్తుచేశారు.